ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్లకు స్టార్ బౌలర్ దూరం.. ప్రసిద్ధ్ కృష్ణకు చోటు!
- ముంచుకొస్తున్న సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ సీజన్
- వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా సిరాజ్కు విశ్రాంతి
- అతడు గాయాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్య
- ఐపీఎల్లో రాణించిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం
- జూన్ 26, 28న ఐర్లాండ్ తో మ్యాచ్ లు... జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ టూర్
రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ కోసం ప్రకటించిన భారత టీ20 జట్లలో కీలక మార్పు జరిగింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను ఈ సిరీస్ల నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో రైట్ ఆర్మ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను సెలక్షన్ కమిటీ జట్టులోకి ఎంపిక చేసింది.
సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ముంచుకొస్తుండటంతో ఆటగాళ్ల పనిభారాన్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో భాగంగా సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్మెంట్ జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సిరాజ్ శారీరకంగా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి, గాయాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగానే ఈ రెస్ట్ ఇచ్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడు. అతను 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటివరకు భారత్ తరఫున ఐదు టీ20లు ఆడి 8 వికెట్లు తీశాడు. అతను చివరిగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ భారత జట్టులోనూ ప్రసిద్ధ్ సభ్యుడిగా ఉన్నాడు.
భారత జట్టు జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టీ20 సిరీస్లో తలపడుతుంది. అనంతరం సెప్టెంబర్లో జపాన్లోని నాగోయాలో జరిగే ఏషియన్ గేమ్స్ మెన్స్ టీ20 ఈవెంట్లోనూ భారత్ పాల్గొననుంది.
సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ముంచుకొస్తుండటంతో ఆటగాళ్ల పనిభారాన్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో భాగంగా సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్మెంట్ జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సిరాజ్ శారీరకంగా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి, గాయాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగానే ఈ రెస్ట్ ఇచ్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడు. అతను 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటివరకు భారత్ తరఫున ఐదు టీ20లు ఆడి 8 వికెట్లు తీశాడు. అతను చివరిగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ భారత జట్టులోనూ ప్రసిద్ధ్ సభ్యుడిగా ఉన్నాడు.
భారత జట్టు జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టీ20 సిరీస్లో తలపడుతుంది. అనంతరం సెప్టెంబర్లో జపాన్లోని నాగోయాలో జరిగే ఏషియన్ గేమ్స్ మెన్స్ టీ20 ఈవెంట్లోనూ భారత్ పాల్గొననుంది.